- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మున్సిపాలిటీలో పారిశుధ్యం శానిటేషన్కు ప్రాధాన్యత..

దిశ, నేరేడుచర్ల: నేరేడుచర్ల మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం , తాగునీటి సరఫరాకు పెద్దపీట వేస్తున్నట్లు నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ బచ్చలకూరి ప్రకాష్ అన్నారు. గురువారం మున్సిపల్ ఆఫీసులో సమావేశంను మున్సిపల్ కమిషనర్ నీలిగొండ వెంకటేశ్వర్లు అధ్యక్షతన గురువారం ఆర్థిక బడ్జెట్ సమావేశం జరిగింది. నూతన చైర్మన్గా ప్రకాష్ బాధ్యతలు చేపట్టిన తొలిసారిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. నేరేడుచర్ల మున్సిపాలిటీలో 2024-25 సంవత్సరం బడ్జెట్ను అంచనా బడ్జెట్ వ్యయం రూ. 24 కోట్ల 17 లక్షల 90 వేలు కాగా సాధారణ పరిపాలన సిబ్బంది జీతభత్యాల కేటాయింపుల తర్వాత ఇంజనీరింగ్ , నీటి సరఫరా , పారిశుద్ధ్యం ప్రజా ఆరోగ్య కార్మికులకై రూ 20.10 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు అలాగే రూ. 49 లక్షలు గ్రీన్ బడ్జెట్కు కేటాయించినట్లు, సాధారణ పరిపాలన సిబ్బంది జీతభత్యాలకు రూ .1 కోటి 35 లక్షల 80 వేలు ఖర్చు చేయనున్నట్లు అంచనా బడ్జెట్ రూపొందించినట్లు వెల్లడించారు.
మున్సిపాలిటీకి సాధారణ ఆదాయం ద్వారా రూ .1.58 కోట్లు, మార్కెట్ ఫీజు ఎగ్రోచ్ మెంట్ ఫీజు కుళాయి పనులు లైసెన్స్ ఫీజుల ద్వారారూ. 31 లక్షల 10 వేలు, ఇతర ఆదాయాల ద్వారా రూ. 19 కోట్ల 98 లక్షల ఆదాయం మున్సిపాలిటీకి లభించనున్నట్లు వివరించారు. సమావేశంలో జూనియర్ అకౌంటెంట్ అధికారి శారద, ఆదాయ వ్యయాల వివరాలను చదివి వినిపించారు. హుజూర్ నగర్ కోదాడ మున్సిపాలిటీలలో వినియోగిస్తున్న విధంగా మిషన్ భగీరథ పైప్ లైన్ల ద్వారా పట్టణంలోని మంచినీటి ట్యాంకులను నింపి రాబోయే వేసవిలో ప్రజలకు నిరంతరంగా మంచినీటి సరఫరాను అందించాలని, ఈ విషయమై కౌన్సిల్ సభ్యులందరూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కొణతం చిన వెంకటరెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు. కౌన్సిల్ సభ్యులందరూ ప్రవేశపెట్టిన బడ్జెను ఏకగ్రీవంగా ఆమోదించారు.
అనంతరం పెద్దపల్లి జిల్లా మందమర్రికి బదిలీపై వెళ్తున్న మున్సిపల్ కమిషనర్ ఎం వెంకటేశ్వర్లను ఘనంగా సన్మానించారు. ఈ బడ్జెట్ సమావేశంలో వైస్ చైర్మన్ అలక సరిత సైదిరెడ్డి, కౌన్సిలర్లు రణరంగ నాగయ్య , బైరెడ్డి జితేందర్ రెడ్డి, కొదమ గుండ్ల సరిత నగేష్, కుంకు సులోచన శ్రీనివాస్ రావు, అమరారపు లలితా భరత్, వేమూరి నాగవేణి నారాయణ, భాష, షహనాజ్ కరిముల్లా, మున్సిపల్ మేనేజర్ అశోక్ రెడ్డి, మున్సిపల్ ఏఈ స్వాతి తదితరులు పాల్గొన్నారు.