- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సాగర్ సిమెంట్ మైనింగ్ విస్తరణ.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్థానికులు

దిశ, హుజూర్ నగర్ (మఠంపల్లి) : సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో ఉన్న సాగర్ సిమెంట్ పరిశ్రమ మైనింగ్ విస్తరణ పబ్లిక్ హియరింగ్ను స్థానికులు వ్యతిరేకించారు. ఈ మేరకు పలువురు ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందించారు. అయితే ప్రస్తుతం పెద్దవీడు మఠంపల్లి గ్రామాలలో తమ సున్నపు రాయి గని యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని 3.8 నుడి 5.4 ఎంటిపిఎకు పెంచుటకు, వీటితో పాటు 1x1000 టిపిహెచ్ క్రషర్ ను నెలకొల్పుటకు ప్రస్తుత మైన్ లీజ్ ఏరియా అయిన 328.58 హెక్టార్లలో సున్నపు రాయి గనిని విస్తరించుటకు ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకునేందుకు అధికారుల సమక్షంలో హియరింగ్ నిర్వహించనున్నారు.
రేపు పబ్లిక్ హియరింగ్ ...
దీనికి సంబంధించి రేపు పబ్లిక్ హియరింగ్ను పెద్దవీడు రెవిన్యూ శివారులోని మైనింగ్ ప్రాంతం వద్ద శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నారు. స్థానిక ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిశ్రమ ఏర్పడి 40ఏళ్లు అవుతున్నప్పటికీ సంబంధిత గ్రామాలు ఏమాత్రం అభివృద్ధికి సహకరించలేదని విద్యా అర్హతలు ఉన్న స్థానికులకు ఏ ఒక్కరికి ఉద్యోగం కల్పించలేదని తెలిపారు. ఈ పరిశ్రమ వల్ల తమకు ఎలాంటి ఉపయోగం లేదని మైనింగ్ విస్తరణకు అభ్యంతరం తెలిపారు. ఈ పబ్లిక్ హియరింగ్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి స్థానికులు ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలంగాణ, సూర్యాపేట జిల్లా కలెక్టర్, జడ్పీ సీఈఓ, జిల్లా పరిశ్రమ శాఖకు ఫిర్యాదులు చేశామని తెలిపారు. ఉన్నతాధికారులు వెంటనే కల్పించుకుని తమకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.