‘అమర్యాద’పై స్పందించిన ఆర్టీసీ..

by Aamani |
‘అమర్యాద’పై స్పందించిన ఆర్టీసీ..
X

దిశ,మర్రిగూడ: అమర్యాద గా..అనుచితంగా మాట్లాడిన డ్రైవర్ దురుసు ప్రవర్తన పై చేసిన ఫిర్యాదు కు ఆర్టీసీ బస్ భవన్ అధికారులు స్పందించారు. కటువుగా,దురుసుగా, అనుచితంగా మాట్లాడిన డ్రైవర్ ఉదంతం లో విచారణ చేపట్టాలని నల్గొండ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.

వివరాల్లోకి వెళ్తే.. పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసిల్దార్ గా నల్లగొండ కు పని చేస్తున్నారు మాచన రఘునందన్. శనివారం నాడు ఆయన హైదరాబాద్ నుంచి నల్లగొండ కు రావడం కోసం ఎల్బీనగర్ లో టి ఎస్ 07 జడ్ 4038 నంబర్ నాన్ స్టాప్ బస్ ఎక్కారు."బస్ హయత్ నగర్ లో ఆగదు" అని కంట్రోలర్ చెప్పిన విషయాన్ని.. బస్ డ్రైవర్ కు రఘునందన్ హయత్ నగర్ లో ఆపినందుకు కంట్రోలర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

దీనికి డ్రైవర్ దురుసు గా స్పందిస్తూ.. నీ టికెట్ వాపస్ ఇచ్చి, దిగిపో. నీకు చెప్పినా ఆమె ను అడుగు పో..అంటూ ఏకవచనంతో కటువుగా అమర్యాద గా మాట్లాడాడు. మీరు నన్ను "నువ్వు" అని సంబోధిస్తున్నారు.నేను మీ అధికారులకు ఫిర్యాదు చేస్తా అని రఘునందన్ హెచ్చరించే ప్రయత్నం చేశారు. అయిన కానీ డ్రైవర్ మరింత దురుసుగా కటువుగా అమర్యాదగా.. "ఏంది.. ఓ.. ఒర్లుతున్నావ్..ఆ.." అంటూ..ప్రయాణికులందరి ముందు, రఘునందన్ పట్ల అమర్యాదగా మాట్లాడాడు.

ఈ విషయం పై రఘునందన్ బస్ లో జరిగిన అవాంచనీయ సంఘటన తో డ్రైవర్ దురుసు ప్రవర్తన తో మనస్తాపానికి గురయ్యాని ఆవేదన వ్యక్తం చేశారు.నల్లగొండ ఆర్టీసీ ఆర్ఎం కు , డీఎం కూ వాట్స్ అప్ ద్వారా ఫిర్యాదు చేశారు.ఆర్టీసీ బస్ భవన్ అధికారుల కు ఎక్స్(ట్విట్టర్) ద్వారా..సదరు డ్రైవర్ పై చర్య తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన ఆర్టీసీ బస్ భవన్ అధికారులు.ఈ ఉదంతం పై విచారణ జరిపి చర్య తీసుకోవాలని నల్లగొండ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. శనివారం "వినియోగ దారులు హక్కుల దినోత్సవం" నాడు ఈ ఘటన జరగడం గమనార్హం.



Next Story

Most Viewed