- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రూ. 12 లక్షల గుట్కా ,పాన్ మసాలా ప్యాకెట్లు పట్టివేత
by Aamani |

X
దిశ,మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ పట్టణంలో పోలీసులు దాడి చేసి రాష్ట్ర ప్రభుత్వం నిషేదిత గుట్కాలను ,పాన్ మసాలా ఫ్యాకేట్లను బుధవారం స్వాధీనం చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. మిర్యాలగూడ వన్ టౌన్ సి.ఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రాత్రి డీఎస్పీ రాజశేఖర రాజు ఆధ్వర్యంలో గణేష్ మార్కెట్లో ఉన్న దుకాణాల లో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఓం ట్రేడర్స్ దుకాణంలో రూ. 1,29,763 , సాయి ట్రేడర్స్ దుకాణంలో రూ. 11,22,818 విలువ గల నిషేదిత గుట్కాలు, పాన్ మసాలా ఫ్యాకేట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు . ఈ మేరకు నిషేదిత గుట్కాలను విక్రయిస్తున్న ఇరువురు వ్యాపారులైన గోపారపు రాజు, ఆకుతోట నర్సింహ్మలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ దాడుల లో ఎస్ ఐ శేఖర్ ,కానిస్టేబుల్ లు వెంకటేశ్వర్లు ,నాగరాజు,మీనా తదితరులు పాల్గొన్నారు.
Next Story