- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రోడ్డు భద్రత మనందరి సమిష్టి బాధ్యత......

దిశ, సూర్యాపేట: రోడ్డు భద్రత అనేది మన సమష్టి బాధ్యతని, అతి వేగంతో ప్రమాదాలకు గురై విలువైన జీవితాన్ని బలి చేసుకోవద్దని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే హితువు పలికారు. 35వ రోడ్డు భద్రత ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్లో నిర్వహించిన డ్రైవర్ల అవగాహన కార్యమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని ఆటో డ్రైవర్లకు పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రయాణంలో అతి వేగంతో అనేక అనర్థాలు జరుగుతాయని, సాధారణంగా ప్రమాదాలకు కారకులైతే రెండు సంవత్సరాల జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదాలకు కారకులైతే 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. ప్రమాదాలకు కారకులుగా మరి ఆర్థికంగా జీవితాలను నష్టపరుచు కోవద్దని సూచించారు.
అలసత్వం, నిర్లక్ష్యంతో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ఫలితంగా మన కుటుంబంతో పాటు ఇతరుల కుటుంబాలు కూడా రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. అలాగే వాహనదారులు ఎప్పటికప్పుడు ఇన్సూరెన్స్, ఫిట్ నెస్, లైఫ్ టాక్స్ కలిగి ఉండాలని, వ్యక్తిగతంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలని చెప్పారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమ నిబంధనల పై అవగాహన కలిగి ఉండాలని, తద్వారా ప్రమాద రహితంగా వాహనాలను నడపవచ్చని స్పష్టం చేశారు. అనంతరం పోలీస్ కళాబృందం రోడ్డు ప్రమాదాల గురించి తమ ఆట పాటలతో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ రాజేష్ మీనా, డీఎస్పీ పరిక నాగభూషణం, పట్టణ సీఐ జి. రాజశేఖర్, ట్రాఫిక్ ఎస్సై నవీన్, సిబ్బంది, డ్రైవర్లు ఉన్నారు.