- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రైతన్నలకు రేవంత్ ప్రభుత్వమే అండ : తీన్మార్ మల్లన్న

దిశ, సూర్యాపేట: తెలంగాణ లో ఏక కాలంలో రైతు రుణమాఫీ అనేది ఓ చారిత్రాత్మక ఘట్టమని, రైతన్నలకు భరోసాగా ఉన్నామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఈ తార్కాణమే అందుకు నిదర్శనమని ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అభిప్రాయ పడ్డారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రైతు రుణమాఫీ నిర్ణయాన్ని హర్షం వ్యక్తం చేస్తూ ఆయన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి తో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ వ్యవసాయం పండుగలా చేయాలని, రైతే రాజు అనే నినాదాన్ని నిజం చేస్తామనే సీఎం పట్టుదలతో ఉన్నట్లు స్పష్టం చేశారు.
ఇందుకు తన బాధ్యతగా రైతు రుణమాఫీ పై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. అందుకు రుణమాఫీ విధివిధానాలు ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి వర్గ మండలికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రైతు పై భారీ రుణమాఫీ బరువును దించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన రైతన్నలు, నాయకులతో కరచాలనం చేశారు. అనంతరం దామోదర్ రెడ్డి మాట్లాడుతూ తానూ ఒక రైతు బిడ్డగా, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గా రైతన్నకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ప్రజలకు మాట ఇస్తే మడమ తిప్పని ఏకైక పార్టీ కాంగ్రెస్ అని, ఏరువాక పౌర్ణమి రోజునే రైతులకు రుణమాఫీ బరువు దించిన ప్రభుత్వానికి, రైతులు శుభాకాంక్షలు తెలపడమే కాకుండా ఎల్లప్పుడూ అండగా ఉంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణు రెడ్డి, పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.