అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ రద్దు చేయాలి.. కేంద్ర మంత్రికి వినతి..

by Sumithra |   ( Updated:2024-12-01 08:16:03.0  )
అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ రద్దు చేయాలి.. కేంద్ర మంత్రికి వినతి..
X

దిశ, రామన్నపేట : కాలుష్యకారక అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని రామన్నపేటలో ఏర్పాటు చేయవద్దని కోరుతూ బీజేపీ మండల అధ్యక్షులు పల్లపు దుర్గయ్య ఆధ్వర్యంలో కేంద్రమంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆదివారం వినతి పత్రం అందజేశారు. కంపెనీ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో మండలంలోని ప్రజలందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించారని తెలిపారు. ఈ ప్రాంతంలో వ్యవసాయం, కులవృతులు చేసుకొని జీవిస్తున్నారని అన్నారు. ఫ్యాక్టరీ ఏర్పడడం వల్ల ప్రజల భవిష్యత్తు ప్రమాదంలో పడిపోయిందని కేంద్ర మంత్రికి వివరించారు.

ఇటీవల లగచర్ల, జగిత్యాల..

ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఆదాని సిమెంట్ ఫ్యాక్టరీని కూడా రద్దు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. అదేవిధంగా రామన్నపేట రైల్వేస్టేషన్ లో నారాయణాద్రి, ఫలక్ నామ ఎక్స్ ప్రెస్ రైల్లు ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజ్ కుమార్, సీనియర్ నాయకులు కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి భాష కర్ల నరేందర్ రెడ్డి, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు రాపోలు రమేష్, మండల కార్యదర్శి రావుల నరేష్, పాల్గొన్నారు.



Next Story

Most Viewed