చెరువులన్నీ నింపాలని ప్రభుత్వ విప్ కు వినతి..

by Sumithra |
చెరువులన్నీ నింపాలని ప్రభుత్వ విప్ కు వినతి..
X

దిశ, రాజాపేట : మండలంలోని చెరువులన్నీ నింపాలని కోరుతూ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు రైతు జేఏసీ నాయకులు ఆదివారం గాంధీ చౌరస్తాలో వినతి పత్రం అందజేశారు. కొత్తగా ఎస్టిమేషన్ వేసిన తర్వాత చెరువులన్నీ నింపేందుకు ప్రయత్నం చేయనున్నట్లు బీర్ల ఐలయ్య తెలిపారు. కాలయాపన చేయకుండా పంటలు ఎండిపోక ముందే చెరువులు నింపాలని రైతు జేఏసీ నాయకులు ఎర్ర గోకుల జస్వంత్, సట్టు తిరుమలేష్, కాకల ఉపేందర్, జన సిద్ధులు, సందుల భాస్కర్ గౌడ్, బెడద వీరేశం, ఉప్పలయ్య, రాజనర్సు, బండి సిద్ధులు కోరారు.

Next Story

Most Viewed