- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గ్రామపంచాయతీ బకాయి బిల్లులు చెల్లించాలంటూ సీఎంకు వినతి

దిశ, రాజా పేట: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో సర్పంచుల అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని తెలంగాణ సర్పంచుల సంఘం నాయకులు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డిలకు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలలో స్టేట్ ఎస్ఎఫ్సీ నిధులు రాక 2 ఏళ్లు గడుస్తుందని, ఎస్ఎఫ్సీ నిధులు విడుదల చేయాలని, కొన్ని గ్రామ పంచాయతీలలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన వైకుంఠ దామాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, క్రీడా ప్రాంగణాలు, గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పనులు చేశారన్నారు. ఈ బిల్లులు ఇప్పటికే రాక కొంతమంది సర్పంచులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు కూడా చేసుకున్నారన్నారు. కావున తక్షణమే ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న సర్పంచుల పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.