ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్

by Aamani |
ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్
X

దిశ,నాగార్జునసాగర్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్‌ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం జరిగిన విషయం విదితమే కాగా.. ఆ ప్రమాదంపై ఆరా తీశారు ప్రధాని.. ఇక, జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ప్రధాని మోడీకి ఫోన్‌లో వివరించారు సీఎం రేవంత్ రెడ్డి.. ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధాని తెలిపారు తెలంగాణ సీఎం.. ఇక, సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారనే విషయాన్ని కూడా ప్రధాని వివరించారు.

సహాయక చర్యల కోసం వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌ టీమ్‌ను పంపిస్తామని సీఎంకు చెప్పారు ప్రధాని మోదీ.. క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చేందుకు… పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి హామీ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ప్రధాని మోదీకి వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధానికి తెలిపారు. సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని ప్రధానికి సీఎం రేవంత్ వివరించారు. పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు ప్రధాని మోదీ.

రంగంలోకి ఎన్డీఆర్ ఎఫ్..

టన్నెల్ లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు 3 NDRF బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. విజయవాడ నుంచి 2, హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఒక ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం రంగంలోకి దిగింది. రాత్రికి భారత సైన్యం కూడా చేరుకుంటుందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. లోపల ఉన్న 8 మంది ప్రాణాలతో ఉన్నారనే సమాచారం ఇప్పటి వరకు తెలియదని మంత్రి పేర్కొన్నారు. సొరంగ ప్రమాదాల్లో దేశంలో కీలకమైన నిపుణుల సహకారంతో బాధితులను రక్షించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి ఉత్తమ్‌ వెల్లడించారు.



Next Story

Most Viewed