పగలు రెక్కీ...రాత్రి చోరీ

by Disha Web Desk 15 |
పగలు రెక్కీ...రాత్రి చోరీ
X

దిశ, మిర్యాలగూడ : పగలు రెక్కీ నిర్వహించి రాత్రి చోరీ చేసే ముఠాను శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. డీఎస్పీ వెంకటేశ్వరావు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాల మండలం నవాపేటకి చెందిన సయ్యద్ అల్తాఫ్ పాత నేరస్తుడు. ఇతను నిజామాబాద్ జైల్లో ఉన్నప్పుడు మిర్యాలగూడ మండలం వాటర్ ట్యాంక్ తండా కి చెందిన రమావత్ సురేష్, పెన్ పాడ్ మండలం లాల్ సింగ్ తండా కి చెందిన అంగోతు నాగరాజు పరిచయమయ్యారు. వీరు ఇటీవల జైలు నుంచి విడుదలయ్యారు. వీరు ఉదయం స్కూటీ పై తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇండ్లు గుర్తించి రాత్రి దొంగతనాలు చేసేవారు. ఇలా దొంగిలించిన సొమ్ముతో ముగ్గురు జల్సాలు చేసేవారు. మిర్యాలగూడ 1, 2 స్టేషన్ల పరిధిలో 4, రూరల్ లో 1, సూర్యాపేట జిల్లా లో 5 కేసులతో కలిపి మొత్తం 10 దొంగతనం కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారు. శుక్రవారం ఉదయం వన్ టౌన్ పోలీస్ లు రాజీవ్ చౌక్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా యాక్టీవా పై వెళ్తున్న ముగ్గురు ని ఆపగా పారిపోయేందుకు యత్నించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా బంగారం అమ్మేందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి 30 తులాల బంగారం, 7కిలోల వెండి, 2 కార్లు, 1 లాప్ టాప్, 1 బైక్, 3సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కోర్టు కి రిమాండ్ కి తరలించినట్లు పేర్కొన్నారు. దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సీఐ రాఘవేందర్, ఎస్సై లు సుధీర్ కుమార్, నర్సింహ, కృష్ణయ్య లతో పాటు పోలీస్ సిబ్బందిని అభినందించారు.



Next Story

Most Viewed