- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రోడ్డు పాలైన రేషన్ బియ్యం…బయటపడ్డ అక్రమ దందా…

దిశ, సూర్యాపేట : జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా దందా రోజురోజుకు పెట్రేగి పోతుంది అనడానికి ఇదొక మచ్చుతునకగా మిగిలింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందులో భాగంగానే జిల్లా కేంద్రం గుండా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంతో వెళ్తున్న మినీ డీసీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో మంగళవారం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై జనగాం క్రాస్ రోడ్డు వద్ద టిఎస్ 05 యుఈ 5389 నంబర్ గల మినీ డిసిఎం వాహనం బోల్తా పడగా.. అందులో పీడీఎస్ బియ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారని చెప్పారు.
కాగా హైదరాబాద్ --విజయవాడ జాతీయ రహదారిపై జనగాం క్రాస్ రోడ్డు వద్ద నుండి అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న సమయంలో మినీ డీసీఎం వాహనం టైరు అకస్మాత్తుగా పేలడంతో అట్టి వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. కాగా ఆ వాహన డ్రైవర్ కు గాయాలయ్యాయి. తక్షణమే సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు పరిశీలించగా అదుపు తప్పిన మినీ డీసీఎం వాహనంలో 35 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వాహనం కోదాడ నుంచి హైదరాబాదుకు వెళుతున్నట్లు డ్రైవర్ సంజీవ పోలీసులకు తెలిపిన అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.