యాదాద్రిలో అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు

by Naresh |
యాదాద్రిలో అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు
X

దిశ, యాదగిరిగుట్ట: ఉగ్ర నరసింహుడిని లక్ష్మీ యుక్తంగా ముస్తాబు చేసి ప్రత్యక్ష భగవానుడైన సూర్యప్రభ వాహనంపై ఆశీనులై మాడ వీధుల్లో ఊరేగిన మహా పర్వం పంచనారసింహలతో విలసిల్లుతున్న యాదాద్రి మహా దివ్య పుణ్యక్షేత్రంలో శుక్రవారం ఉదయం ఆవిష్కృతమైంది. రథసప్తమి పర్వదినం సందర్భంగా ఈ తిరువీధి సేవోత్సవాన్ని సూర్యోదయ వేళ చేపట్టారు. ఆలయ పడమటి మహారాజ గోపురం నుంచి తూర్పు ముఖంగా గల రాజగోపురం వరకు సేవను ఊరేగించారు. రథసప్తమి విశిష్టతను ఆలయ ప్రధాన పూజారులు లక్ష్మీనరసింహా చార్య ,వెంకటాచార్యులు తెలిపారు. ఈవో రామకృష్ణారావు, ధర్మకర్త నరసింహ మూర్తి, పేష్కార్ రఘు, ఏఈవో రామ్మోహన్ రావు, పర్యవేక్షకులు సురేందర్ రెడ్డి ఆలయ భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా రాత్రివేళ స్వర్ణ రథోత్సవం వేడుకలు నిర్వహించారు. ఆలయ సంప్రదాయంగా శ్రీలక్ష్మీనరసింహులను ప్రత్యేక అలంకరణతో తీర్చిదిద్ది స్వర్ణ రథం పై అధిష్టింపజేసి సేవా పర్వాన్ని తొలిమాడ వీధులలో కొనసాగించారు. స్వర్ణ రథం పై ఊరేగిన శ్రీ స్వామి, అమ్మవారలను భక్తులు దర్శించుకున్నారు.



Next Story

Most Viewed