- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రామకృష్ణారెడ్డి తన స్థాయిని మరిచి సీఎంపై వ్యాఖ్యలు : భువనగిరి ఎమ్మెల్యే

దిశ,యాదాద్రి భువనగిరి ప్రతినిధి : బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి తన స్థాయిని మరిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశాడని, కేసీఆర్ మెప్పుకోసం ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన భువనగిరి పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు అడ్డగోలు మాటలతో కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టారని, తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా కేసీఆర్ ను పరుష పదజాలంతో దూషించి లేదన్నారు. కేసీఆర్ పట్ల భక్తి చాటుకోవడానికి కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టారని, స్థాయిని మించి మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి రామకృష్ణారెడ్డి పక్కన కూర్చొని మాట్లాడించాడని, ప్రజాస్వామ్యబద్దంగా మాట్లాడాలని అన్నారు.
రామకృష్ణారెడ్డిపై తప్పకుండా కేసు పెడతామన్నారు. పార్టీ కనుమరుగవుతున్న నేపథ్యంలో కావాలని జనంలోకి వెళ్లడానికి ఇదో కుట్ర పన్నారని చెప్పారు. యూత్ కాంగ్రెస్ నాయకులను గుండాలు అంటున్నారని, ఎంత వరకు సమంజసమన్నారు. ఎమ్మెల్యే ఓడిపోయాక కనుమరుగు అయ్యాడని, తాను అడ్డు పడకపోతే శేఖర్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండే వాడని వెల్లడించారు. బీఆర్ఎస్ ఐదు సంవత్సరాల పాలనలో భువనగిరిలో నయీమ్ ఆగడాలు జరిగాయని, నయీమ్ సంబంధించిన ఆస్తులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. నయీమ్ అనుచరులు చాలామంది బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారన్నారు. ఫైళ్ల శేఖర్ రెడ్డి 100 ఎకరాల వెంచర్ చేశాడని, అందులో అసైన్డ్ భూమి ఉందని, ఒక కాల్వను కూడా కబ్జా చేశారని దీనిపై సర్వే పెట్టాలన్నారు. భువనగిరిలో ఒక్క ఇంచు భూమి కూడ కబ్జాకు గురి కావొద్దని, ఎక్కడైనా కబ్జాలకు గురైతే తన దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యకర్తలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని, బీఆర్ఎస్ మాటలు భువనగిరి బ్రాండ్ ఇమేజ్ కు దెబ్బతీసేలా ఉన్నాయని, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.