- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : కలెక్టర్

దిశ ,నార్కట్ పల్లి : గురుకుల పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. తన పర్యటనలో భాగంగా నార్కట్ పల్లి మండలంలోని చిన్న నారాయణపురం గురుకుల పాఠశాల, అక్కెనపల్లి ప్రాథమిక ఆసుపత్రిని ఆకస్మికంగా శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు సలహాలు అందించారు. ముఖ్యంగా వంటగదిని పరిశుభ్రంగా ఉంచాలని,నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలన్నారు. దీనికి తోడు ప్రతినిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. అంతకుముందు విద్యార్థులతో పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. చదువులో ముందుండాలని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎల్ . వెంకటేశ్వరరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.