- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్యా బోధన

దిశ, నడిగూడెం:ప్రభుత్వ కళాశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని ప్రిన్సిపాల్ విజయ్ నాయక్ అన్నారు. పేద విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత సౌకర్యాలను ప్రభుత్వ కళాశాలలో చేరి వాటిని సద్వినియోగం చేసుకోవాలని స్థానిక కే ఎల్ ఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ఇంటర్ బోర్డు కమిషనర్ ఆదేశాల మేరకు వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల నమోదు పెంచేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నారు. కళాశాలలో ఉన్న వివరాలను పొందుపరిచిన కరపత్రాలతో ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో అధ్యాపకులు శుక్రవారం నడిగూడెం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ముందస్తు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డి విజయ నాయక్ మాట్లాడుతూ.. విద్యార్థుల నమోదు శాతం పెంచేందుకు కృషి చేయాలని అధ్యాపకులకు సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ జానీ పాషా మహేష్, వీరన్న, శ్రీనివాసరావు వెంకటేశ్వరరావు, రజిత, మదర్, సుజాత, ధనుంజయ్ హేమ, నాగరాణి, రవివర్మ పాల్గొన్నారు.