- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కొనుగోలు కావివి.. దోపిడీ కేంద్రాలు..నిర్వాహకుల ఇష్టారాజ్యం

దిశ,తుంగతుర్తి: ధాన్యం కొనుగోలు కేంద్రాలు దోపిడీకి నెలవుగా మారాయి.కేంద్రాల నిర్వాహకుల ఇష్టారాజ్యంతో రైతాంగం నిలువునా దోపిడీకి గురై లబోదిబోమంటూ మొత్తుకుంటున్నారు.కేంద్రాలకు ధాన్యాన్ని ఎందుకు తెచ్చాం రా ...బాబు అంటూ బాహటంగా పేర్కొంటున్నారు.అయితే కేంద్రాలపై సంబంధిత శాఖ అధికారుల ఆజమాయిషి లేకపోవడమే ఇలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతాంగం ఆరోపిస్తోంది.ఫిర్యాదు చేసిన పట్టించుకునే ధోరణిలో వారు లేకుండా పోతున్నారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా నిర్ణయించిన తూకం కంటే అదనంగా ధాన్యాన్ని తీసుకుంటున్నారని రైతాంగం వివరిస్తోంది.
దీనికి తోడు బస్తా ఒక్కింటికి రూ.రెండు నుంచి రూ.ఐదు వరకు తమ నుంచి వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.బస్తాలకు వేసే రంగుల ఖర్చులు తమతోనే పెట్టిస్తూ బస్తాల పై వాటితో రాయిస్తున్నారని పేర్కొన్నారు.ఇవన్నీ ఇలా ఉంటే కేంద్రాల్లో పోసిన ధాన్యానికి రక్షణ లేకుండా పోతుంది. ధాన్యం చోరీకి గురవుతోంది.ఇదేమని నిర్వాహకులను ప్రశ్నిస్తే డొంక తిరుగుడు మాటలు వారి నుంచి వస్తున్నాయి. కుక్కలు,పశువులు,ఇతరత్రా జంతువులు తింటున్నాయంటూ నిర్వాహకులు రైతుల మొహం మీదనే చెప్తున్నారు.ఇదేందని ప్రశ్నించే రైతాంగానికి కేంద్రాల నిర్వాహకుల నుండి చీదరింపులే.
ఈ తతంగమంతా ఎక్కడిదో కాదు...! సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని పలు గ్రామాలలో ఏర్పాటైన ధాన్యం కొనుగోలు కేంద్రాల సంగతులు ఇవి.మండలంలో 24 గ్రామాలు ఉన్నాయి.ఈ మేరకు రెండు మూడింటిని మినహాయిస్తే మిగతా ప్రాంతాల్లో సన్న,దొడ్డు రకం వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి.అయితే ఇందులో గొట్టిపర్తి గ్రామానికి వచ్చేసరికి కేంద్రాల నిర్వాహకుల తీరు రైతాంగ దోపిడీకి నెలవైంది.ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ఖర్చులు,కమిషన్,తదితర ప్రభుత్వం నుండి పొందుతున్నప్పటికీ నిర్వాహకులు మాత్రం రైతుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు.తూకం చేసిన ధాన్యం బస్తా ఒక్కంటిపై అదనంగా 700 గ్రాములు,నగదు రూ.5 చొప్పున తీసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.అలాగే ధాన్యం బస్తాల పై వివిధ రకాల ముద్రలు వేసే నిమిత్తం తమతోనే రంగులు తెప్పించడం,బస్తాలపై రాయించడం లాంటివి చేస్తున్నారని ఆరోపించారు.ముఖ్యంగా ధాన్యం కూడా చోరీకి గురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ విషయంపై కేంద్రాల నిర్వాహకులను ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానం ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
కేంద్రం దోపిడీతో కొనసాగుతుంది : తాళ్లపల్లి యాదగిరి (రైతు, గొట్టిపర్తి)
ఈ విషయమై రైతు తాళ్లపల్లి యాదగిరి మాట్లాడుతూ తనకు చెందిన 160 బస్తాల పై రూ. 1100 వసూలు చేశారని పేర్కొన్నారు. అలాగే బస్తా ధాన్యాన్ని 41 కిలోల 200 గ్రాములకు తూకం వేశారని ఆరోపించారు.కలర్ ల కోసం మరింత వెచ్చించానని తెలిపారు. కేంద్రం దోపిడీతో కొనసాగుతుందని ఆరోపించారు.
నిర్వాహకులు ఇబ్బందులు పెడుతున్నారు : ఎస్.కె సబాన్ (రైతు,గొట్టిపర్తి)
తాను కూడా కొనుగోలు కేంద్రంలో అదనంగా డబ్బులు చెల్లించాలని రైతు సుభాన్ అన్నారు. అదనంగా డబ్బులు ఇవ్వకపోతే అనేక రకాల కొంటి సాకులతో నిర్వాహకులు ఇబ్బందులు పెడుతున్నారని, చివరికి డబ్బులు చెల్లించ వచ్చిందన్నారు. క్వింటా ధాన్యానికి రూ.12 చెల్లించాలని ఆందోళన వ్యక్తం చేశారు.
అధికారి ఏనాడు పట్టించుకోలేదు : చిలుకల వెంకన్న (రైతు,గొట్టిపర్తి)
గొట్టిపర్తి గ్రామ రెండవ సంఘంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలు పక్కకు పెట్టి దోసుకుంటున్నారని రైతు చిలుకల ఆరోపించారు.దీనికి సంబంధించిన శాఖ అధికారి ఏనాడు పట్టించుకోలేదని స్పష్టం చేశారు.
నా వడ్లు చోరీకి గురయ్యాయి : కొమురయ్య,రైతు
కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యంలో దాదాపు తింటున్నారా వరకు చోరీకి గురైందని రైతు కొమురయ్య తెలిపారు. ఇదే విషయాన్ని నిర్వాహకులను అడిగితే ఇష్టం వచ్చినట్లు, పొంతన లేని సమాధానాలు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు.కుక్కలు,ఇతరత్రా జంతువులు తిన్నవేమో...? మాకేం తెలుసు అంటూ జవాబిస్తున్నారని పేర్కొన్నారు.