- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రజావాణి ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనివ్వాలి : కలెక్టర్

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : ప్రజలు అందించిన ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిచ్చి పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుండి 45 ఫిర్యాదులను స్వీకరించారు. వాటిలో రెవెన్యూ శాఖ 34, పోలీసు శాఖ 3, జిల్లా పంచాయితీ అధికారి 2, పౌర సరఫరాలు, మైనారిటీ శాఖ, వెనుకబడిన తరగతుల శాఖ, యాదాద్రి దేవస్థానం, భువనగిరి మున్సిపాలిటీ, నీటి పారుదల శాఖ ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.
అనంతరం ఆయన జిల్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.... ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని అందించే ఫిర్యాదులు, దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి, ఎలాంటి పెండింగ్ లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్ ప్రజా భవన్ నుంచి వచ్చే ఫిర్యాదులను కూడా ఎలాంటి జాప్యం లేకుండా సత్వరమే పరిష్కరించాలని, తీసుకున్న చర్యలపై కలెక్టరేటు పరిపాలన అధికారికి నివేదిక అందించాలని, ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జయశ్రీ, జగన్నాధరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం.ఎ.కృష్ణన్, కలెక్టరేటు పరిపాలన అధికారి జగన్మోహన్ ప్రసాద్, సూపరింటెండెంట్ రామ్మూర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.