- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రజా పాలన దరఖాస్తు నిరంతర ప్రక్రియ
by Naresh |

X
దిశ, మునగాల: మునగాల మండల పరిధిలో ఉన్న వ్యవసాయ భూముల సమస్యల పై ఇప్పటివరకు అందిన ఫిర్యాదులను తక్షణమే తహసీల్దార్, ఆర్ఐ పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఆదేశించారు. శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేసి సాదా బైనమా దరఖాస్తులు మినహా ఇతర దరఖాస్తులను సత్వరమే పరిష్కరించే విధంగా మండలంలో మూడు టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజాపాలన ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని మహాలక్ష్మి, గృహలక్ష్మి, ప్రభుత్వ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరు నమోదు చేసుకున్న దరఖాస్తులను సవరణ చేసుకునేందుకు, నూతనంగా దరఖాస్తు నమోదు చేసుకునేందుకు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, ఆర్ఐ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story