రోడ్డెక్కిన అన్నదాతలు.. ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా

by Sumithra |
రోడ్డెక్కిన అన్నదాతలు.. ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా
X

దిశ, చివ్వేంల : సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుర్రం తండా ఐకేపీలో గత 15 రోజులుగా ధాన్యం కొనుగోలు చేస్తలేదని మంగళవారం ఉదయం సూర్యాపేట దంతాలపల్లి జాతీయ రహదారి పై రైతులు పెద్దఎత్తున ధర్నా నిర్వహించి వడ్లకు నిప్పంటించారు. రోడ్డుపై కంప వేసి రైతులు రోడ్డుపై బైఠాయించారు. ధాన్యం కొనుగోలు జరిగేంత వరకు ధర్నా విరమించమని కూర్చున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించగా 3000 వేల బస్తాలు ధాన్యం నింపి ఉన్నాయి. లారీలు రాక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

మిల్లులలో పంపించిన లారీలు దిగుమతి కాక మూడు, నాలుగు రోజులు ఎదురు చూడవలసి వస్తుందని వారు తెలిపారు. జిల్లా అధికారులు మిల్లర్లతో చర్చలు జరిపి ఎక్కువ మిల్లులకు ట్యాగింగ్ వచ్చే విధంగా చూడాలని వారు కోరారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని రైతులను ధర్నా విరమింప చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రైతుల ధర్నా కొనసాగించడంతో సూర్యాపేట దంతాలపల్లి రహదారి పై భారీగా వాహనాలు నిలిచాయి. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ను గాయం వారి గూడెం నుంచి ఎంజీ నగర్ తండా జాతీయ రహదారి 365 (బిబి) కి మళ్ళించారు.



Next Story

Most Viewed