రోడ్డు ప్రమాదంలో గర్భిణీ స్త్రీ పాప మృతి

by Disha Web Desk 23 |
రోడ్డు ప్రమాదంలో గర్భిణీ స్త్రీ పాప మృతి
X

దిశ, మర్రిగూడ: మాల్ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాంపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన గర్భిణీ స్త్రీ తో పాటు 8 సంవత్సరాల పాప మృత్యువాత పడ్డారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివారాల ప్రకారం.. వడ్డేపల్లి గ్రామానికి చెందిన సంభారపు అరుణ్ కారులో కుటుంబ సభ్యులు భార్య తల్లి పక్కింటి పాపతో హైదరాబాదు కు వెళ్తుండగా మాల్ సమీపంలో కారు అదుపుతప్పి చెట్టుకు బలంగా ఢీకొంది. దీంతో గర్భిణీ స్త్రీ అయిన భార్య ,పాప ,తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా భార్య, పాప మృత్యువాత పడ్డారు. అరుణ్ తల్లికి కాళ్లు చేతులు కు తీవ్ర గాయాలయ్యాయి.


Next Story

Most Viewed