శవం వెలికి తీసి పోస్టుమార్టం

by Kalyani |   ( Updated:2024-06-30 16:08:14.0  )
శవం వెలికి తీసి పోస్టుమార్టం
X

దిశ ,మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మండలం అవంతీపురం గ్రామంలో పూడ్చిన శవానికి పోస్టుమార్టం చేసిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. మిర్యాలగూడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన శివనేని అరుణ(47) యాద్గార్ పల్లి సమీపంలోని ఎస్ ఎం ఎస్ ఆగ్రో ఆయిల్ మిల్లులో పని చేస్తూ మే 31 న అస్వస్థతకు గురైంది. దీంతో చికిత్స నిమిత్తం నల్గొండ , హైదరాబాద్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈ నెల 25 న మృతి చెందింది. బంధువులు అంత్యక్రియలు పూర్తి చేసి పూడ్చి పెట్టారు. మిల్లు యాజమానుల నిర్లక్ష్యం వలన సకాలంలో వైద్యం అందించకపోవడం వలన చనిపోయిందని మృతురాలి కుమారుడు ప్రేమ్ కుమార్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ నరేష్ కుమార్, తహసీల్దార్ హరిబాబుల సమక్షంలో శవాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed