పోలీసులంటే సమాజంలో గౌరవాన్ని పెంచే విధంగా పని చేయాలి :హుజూర్ నగర్ సీఐ

by Aamani |
పోలీసులంటే సమాజంలో గౌరవాన్ని పెంచే విధంగా  పని చేయాలి :హుజూర్ నగర్ సీఐ
X

దిశ, హుజూర్ నగర్ : పోలీసులు విధుల పట్ల సక్రమంగా నిర్వహించి ప్రజలకు పోలీసులంటే సమాజంలో గౌరవాన్ని పెంచే విధంగా పనిచేయాలని హుజూర్ నగర్ సిఐ జి. చలమంద రాజు అన్నారు . సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఇటీవల కానిస్టేబుల్ గా ఎంపికై ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 31 మందిని కానిస్టేబుల్ లను హుజూర్ నగర్ సర్కిల్ కి ఎంపిక చేసి పంపించారు. ఈ ఎంపిక చేసి పంపించిన 31 మంది కానిస్టేబుల్ లకు సీఐ చరమంద రాజు పోలీస్ విధుల గురించి, ప్రజలతో ఎలా మెలగాలి,సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలి శాంతి భద్రతలు ఎలా కాపాడాలని అనే అంశాలపై అవగాహన కల్పించారు. మంచిగా విధులు నిర్వహించి, సూర్యాపేట జిల్లాకు, పోలీస్ స్టేషన్ కు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ గరిడేపల్లి నేరేడుచర్ల పాలకవీడు మఠంపల్లి ఎస్సైలు ముత్తయ్య నరేష్ రవీందర్ లక్ష్మీ నరసయ్య రామాంజనేయులు ఏఎస్ఐ బలరాం రెడ్డి పాల్గొన్నారు.



Next Story

Most Viewed