- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు అప్రమత్తంగా ఉండాలి

దిశ, సూర్యాపేట : పదో తరగతి పరీక్ష ప్రారంభమైన సందర్భంగా పలు పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పట్టణంలోని 60 ఫీట్ రోడ్లో గల కాకతీయ హై స్కూల్, వివేక వాణి విద్యా మందిర్ హై స్కూల్ లో ఉన్న పరీక్షా కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. పదో తరగతి పరీక్షలు రాసే పిల్లలకు ప్రశాంత వాతావరణ కల్పించాలని, పరీక్షలు సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు ఉండాలని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. మొబైల్ ఫోన్లు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదని, ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాత లోనికి పంపాలని, సెల్ ఫోన్ అనుమతించవద్దని ఆదేశించారు.
ఈరోజు జరిగిన తెలుగు పరీక్షకు మొత్తం 11,943 మంది విద్యార్థులకు గాను 11,904 మంది విద్యార్థులు(99%) హాజరయ్యారని 39 మంది గైర్హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు. ఆకస్మికంగా పరిశీలించిన కాకతీయ హై స్కూల్ నందు 140 విద్యార్థులకు గాను 139 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని 1 గైర్హాజరయ్యారని చీఫ్ సీహెచ్ శ్రీహరి కలెక్టర్కు వివరించారు. అలాగే వివేక వాణి విద్యా మందిర్ హై స్కూల్ నందు 180 మంది గాను 180 మంది పరీక్షకు హాజరయ్యారని చీఫ్ సూపర్డెంట్ రమణారెడ్డి కలెక్టర్కు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యుదీకరణ తాగునీటి వసతి బెంచీల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఇన్చార్జి ఎంఈఓ శైలజ, అధికారులు, సిబ్బంది ఉన్నారు.