మండి బిర్యానీ తింటే చట్నీలో ప్లాస్టిక్ కవర్ ఫ్రీ

by Sumithra |
మండి బిర్యానీ తింటే చట్నీలో ప్లాస్టిక్ కవర్ ఫ్రీ
X

దిశ, భూదాన్ పోచంపల్లి : మండి బిర్యానీ తిందామని రెస్టారెంట్ కు వెళ్లిన ఓ వ్యక్తికి షాకింగ్ ఘటన ఎదురైంది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. పట్టణ కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి మండి బిర్యానీ తింటున్న క్రమంలో చట్నీలో ప్లాస్టిక్ కవర్ ప్రత్యక్షమైంది. 15 రోజుల కిందట అదే రెస్టారెంట్ లో కోడి బూరు ప్రత్యక్షమైంది. దీంతో సదరు కస్టమర్ హోటల్ నిర్వాహకులను ప్రశ్నించాడు. అయితే బై మిస్టేక్ లో ఇలా జరిగిందని హోటల్ నిర్వాహకులు సమాధానం ఇచ్చారు. కాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్, రెస్టారెంట్లో తనిఖీలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.



Next Story

Most Viewed