- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు

దిశ ,మిర్యాలగూడ టౌన్ : బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్కైలాబ్ నాయక్ సంచలన ఆరోపణలు చేశారు. పట్టణంలోని తన నివాసంలో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భాస్కరరావు గత పదేళ్ల లో సుమారు 150 మంది ఫోన్ లను ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో భాస్కరరావును ముద్దాయిగా చేర్చాలని డిమాండ్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ చేయించి ఒక రైస్ మిల్లర్ ను ,ఓ అధికారిని బెదిరించారని ఆరోపించారు. ప్రభుత్వ భూమిని అక్రమించి వైదేహి వెంచర్ నిర్మించినది వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. వెంచర్ విషయంలో ఓ బిసి నాయకుని బెదిరించి సంతకాలు పెట్టుంచుకున్నది వాస్తవం కాదా ?అని ప్రశ్నించారు.పదేళ్ల పాలనలో అభివృద్ధి చేసింది ఏమీ లేదని అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డాడని విమర్శించారు. అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సభను ప్రజలే స్వచ్ఛందంగా అడ్డుకుంటారని తెలిపారు.