- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
హాలియా మున్సిపాలిటీలో అవిశ్వాసానికి కలెక్టర్ కు వినతి

దిశ, హాలియా : హాలియా మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు శనివారం జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనకు వినతిపత్రం సమర్పించారు. మున్సిపాలిటీలో గత కొన్ని నెలలుగా అభివృద్ధిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కి చెందిన కౌన్సిలర్ లు విశ్వాసం కోరడంతో హాలియా మున్సిపాలిటీలో అధికార మార్పిడి తప్పదని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. హాలియా మున్సిపాలిటీలో మొత్తం 12 మంది కౌన్సిలర్ల గాను కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది మంది కౌన్సిలర్లు
ఉండగా బీఆర్ఎస్ పార్టీకి నలుగురు మాత్రమే ఉన్నారు. ఇందులో చైర్ పర్సన్ వైస్ చైర్మన్ లతో పాటు ఒకటో వార్డు 11వ వార్డు కౌన్సిలర్లు ఉన్నారు. విశ్వాసం కోసం కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కలెక్టర్ కు నోటీస్ అందజేశారు. వినతి పత్రం అందించిన వారిలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చింతల చంద్రారెడ్డి అన్నేపాక శ్రీనివాస్, ప్రసాద్ నాయక్ ,ఎడవల్లి అనుపమ, గౌని సుధారాణి, తక్కెళ్ళపల్లి ఎల్లమ్మ, చింతల దీప్తి ,పిల్లి చంద్రకళ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాకునూరు నారాయణ గౌడ్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గౌని రాజా రమేష్, ఎడవల్లి నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.