కంటి వెలుగు నిర్లక్ష్యం.. నత్తనడకన సాగుతున్న కార్యక్రమం!

by Dishanational4 |
కంటి వెలుగు నిర్లక్ష్యం.. నత్తనడకన సాగుతున్న కార్యక్రమం!
X

దిశ, నాగార్జునసాగర్: నందికొండ మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం నత్త నడకన కొనసాగుతుందని.. చెప్పడానికి నిదర్శనం కంటి అద్దాల జారీలో జాప్యం కనిపిస్తోంది. కంటి పరీక్షలు జరిగి పది రోజులైనా కూడా కళ్లద్దాలు పంపిణీలో నిర్లక్ష్యమా లేక వైఫల్యమా తెలియడం లేదు. పనులు మానుకొని వాళ్ళు ఇచ్చే కళ్ళజోళ్ళ కోసం పలుమార్లు కంటి వెలుగు కేంద్రాలకు తిరుగ లేక ప్రజలు అవస్థలు పడుతున్నామని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు ఒక నిర్దిష్టత స్పష్టత లేని కళ్ళజోళ్ళ పంపిణీ కనీసం రీడింగ్ అద్దాలు కూడా అందజేయలేని పరిస్థితి నెలకొంది స్థానికులు వాపోతున్నారు. ఇలాంటి జాప్యానికి గల కారణాలను అధికారులు గమనించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


Next Story

Most Viewed