- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కాంగ్రెస్ మోసపూరిత వాగ్ధానాలకు నమ్మి గోస పడుతున్న తెలంగాణ ప్రజలు : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

దిశ,వలిగొండ: ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత వాగ్ధానాలను నమ్మిన తెలంగాణ ప్రజలు అరిగోస లు పడుతున్నారని మాజీ మంత్రి,సూర్యాపేట ఎమ్మెల్యే గుంట కండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వేములకొండ గుట్ట నుండి శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వరకు ఈనెల 27 వ తేదిన వరంగల్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న రజతోత్సవ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ,బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూర్గు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్ర ప్రారంభానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పాదయాత్రను ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మోసపు వాగ్దానాలను నమ్మి ఓట్లు వేసిన తెలంగాణలో వ్యవసాయం నాశనమైపోయి రైతులకు ఏడుపే మిగింలిందని,మహిళలు, కూలీలు,ఆటో కార్మికులు, యువజనులతో పాటు యావత్ తెలంగాణ సమాజం మోసపోయి గోసపడుతున్నదని,కేసీఆర్ పాలనే బాగుందని,కేసీఆర్ ఉంటే బాగుందని తెలంగాణ సమాజం చర్చించుకుంటుందన్నారు.
27వ తేదిన నిర్వహించే రజతోత్స మహసభ జయప్రదం చేయాలని కోరుతూ బీఆర్ఎస్ విద్యార్ధి విభాగం,బీఆర్ఎస్ యువజన విభాగం చేపట్టిన మహాపాద యాత్ర విజయవంతం కావాలని,వరంగల్ మహా సభకు లక్షలాదిగా ప్రజలు,యువకులు, విద్యార్థులు తరలి వచ్చి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు మరింత శక్తిని అందించి జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో డిసీసీబీ మాజీ అధ్యక్షుడు గొంగిడి మహేందర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి,గాదరి కిషోర్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బూడిద బిక్షమయ్య గౌడ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణా రెడ్డి, చింతల వెంకటేశ్వర్ రెడ్డి, క్యామ మల్లేశం, పైళ్ల రాజ వర్ధన్ రెడ్డి,మొగుళ్ళ శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకట్ రెడ్డి,పిఎస్ సి ఎస్ చైర్మన్ సుర్కంటి వెంకట్ రెడ్డి, ముద్దసాని కిరణ్ రెడ్డి,కొమిరెల్లి సంజీవరెడ్డి,డేగల పాండరి, కునపూరి కవిత, పలుసం రమేష్,గూడూరు శేఖర్ రెడ్డి, నాగారం ప్రశాంత్, తొట స్వామి, జానీ తదితరులు పాల్గొన్నారు