- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రజలకు మా పార్టీపై విశ్వాసం ఉంది

దిశ, సూర్యాపేట : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణలో ప్రజలు ఆమె రుణం తీర్చుకునేలా రాష్ట్రంలో అధికారం ఇవ్వడంతో పాటు ఎంపీ స్థానాలను సైతం రికార్డు స్థాయిలో గెలుచుకున్నామని కాంగ్రెస్ పార్టీ నియోజక ఇన్చార్జి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. ఇప్పటికీ పార్టీపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఈ సందర్భంగా విజయం సాధించిన కుందూరు రాఘువీర్ రెడ్డికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 4,600 ఓట్ల తేడాతో ఓటమి పాలైన తాను మా పార్టీ నాయకులు,కార్యకర్తల కృషితో నేడు ఎంపీ ఎన్నికల్లో నియోజక వర్గంలో 70 వేల మెజార్టీ తీసుకొచ్చామని చెప్పారు.
ఆ ఎన్నికల్లో జగదీష్ రెడ్డి రూ.100 కోట్లు ఖర్చు పెట్టినప్పటికి నైతిక విజయం నాదేనన్నారు. విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి ఆ శాఖలో కూడా ఏనాడూ సమీక్ష చేయలేదని, గడిచిన 10 ఏళ్లలో అంతా అవినీతినే జరిగిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అసలైన పేద దళితులకు దళితబంధు అందలేదు కానీ ఉద్యోగులకు మాత్రం అందిందన్నారు. నాగార్జున సాగర్, ఎస్సారెస్పీ, మూసీపై ప్రణాళిక తయారు చేసి పునరుద్దరించి తాగు, సాగునీరు అందిస్తామని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీతో లోపాయకార ఒప్పందం ఉండబట్టే కాంగ్రెస్ పార్టీ 8 సీట్లకు పరిమితం అయ్యిందని, లేకుంటే 11 సీట్లు వచ్చేవన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి, రాష్ట్ర నాయకులు కొప్పుల వేణురెడ్డి, కాకి కృపాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆంజద్ అలీ, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.