ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు

by Naresh |   ( Updated:2024-03-01 16:14:58.0  )
ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు
X

దిశ, నల్గొండ: నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ సంకల్ప యాత్ర ముగింపు సభలో ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాటాక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడిందని, చాలా మంది జైలు పాలు అయ్యారని, బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణాలో మనుగడలో లేకుండా పోతుందని అన్నారు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరలేదన్నారు. బీఆర్‌ఎస్ ని కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అని అన్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ మోడీ వల్ల మాత్రమే అయ్యిందని, తీన్ తలక్ మైనార్టీల కోసం పార్లమెంటులో బిల్లు పెట్టి రద్దు చేశాం అన్నారు. నల్గొండ పార్లమెంట్ స్థానం మే కాకుండా రాష్ట్రంలో అన్ని పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది అని అన్నారు. దేశ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు రావడం ఖాయమని అన్నారు. విజయ సంకల్ప యాత్ర జనాధారణ వెళ్ళు వేత్తుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ వైపు ప్రజా ధారణను చూసి భయంతో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ ,బీజేపీ పొత్తు అని పొంతన లేని మాటలతో ప్రజల్లో మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్లమెంట్ సీట్లు గెలవడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని నేడు దేశానికి ఆదర్శం నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో సంక్షేమ పథకాలకు అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్న ఎక్కడ వాటి ప్రచారం చేయడం లేదని మండిపడ్డారు. జాతీయ రహదారులకు త్వరలోనే నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తారని సూచించారు. వికసిత భారత్ పేరిట రాబోయే 20 సంవత్సరాల్లో మన దేశం నరేంద్ర మోడీ తీసుకున్న అనేక విప్లమాత్మకమైన నిర్ణయాలతో దేశం ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థ గా ఎదుగుతుందని అన్నారు. 500 సంవత్సరాలు హిందువుల కల అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కేవలం బీజేపీతోనే నరేంద్ర మోడీ కటోర శక్తి, అంకుఠిత దీక్ష ద్వారానే సాధ్యమైందని పేర్కొన్నారు.

దేశ అభివృద్ధి పథంలో మరింత దూసుకెళ్లాలంటే నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానిగా ఎన్నుకోవాలని వచ్చే ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకోవాలని ప్రజలు ఒకసారి బీజేపీనీ ఆదరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో.డాక్టర్ నాగం హర్షిత్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు. మాద గాని శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర కార్యదర్శి , గోలి మధుసూదన్ రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, చంద్రశేఖర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంకణాల శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, గార్లపాటి జితేంద్ర కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,బండారు ప్రసాద్ పార్లమెంట్ కన్వీనర్, పొతేపాక సాంబయ్య ,పెరిక ముని కుమార్, దాయం భూపాల్ రెడ్డి అసెంబ్లీ కన్వీనర్, కాసం వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీమతి శ్రీదేవి రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మనోహర్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బక్రం శ్రీను తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed