గ్రామపంచాయతీ సిబ్బంది పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలి

by Naveena |
గ్రామపంచాయతీ సిబ్బంది పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలి
X

దిశ,రామన్నపేట : గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు రామన్నపేట మండల కేంద్రంలో తెలంగాణ గ్రామ పంచాయితీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా..రెండు రోజుల టోకెన్ సమ్మెను స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముందు ప్రారంభించారు. ఈ సందర్బంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ..గ్రామాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచి, ప్రజల ఆరోగ్యాన్ని, గ్రామాలను కాపాడుతున్న పారిశుద్ధ్య కార్మికుల పట్ల ప్రభుత్వ మొండి వైఖరి విడనాడి, కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేసి, పదవీ విరమణ 10 లక్షల రూపాయల సౌకర్యం కల్పించి, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ గొరిగ సోములు, గ్రామ పంచాయతీ ఎంఎస్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బందెల భిక్షం, మండల అధ్యక్షులు గాదె ఎల్లయ్య, మండల ప్రధాన కార్యదర్శి నకిరేకంటి రాము, మహిళా కోకన్వీనర్ మంచాల రేణుక, ఉప్పునూతల నరసింహ, ముక్కుర్తి లక్ష్మమ్మ, భాషబోయిన మచ్చగిరి, జింక లక్ష్మమ్మ, బొడ్డు సాలయ్య, గాదె యాదయ్య, కొమ్ము కవిత, కాడ యాదమ్మ, బూడిది ముత్తయ్య, చిత్రకంటి శోభ, కొమ్ము సావిత్రమ్మ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed