- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి జరిమానా

దిశ,సంస్థాన్ నారాయణపురం : బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి ఎక్సైజ్ పోలీసులు జరిమానా విధించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం వెంకంబావి తండా గ్రామానికి చెందిన కరెంటోతూ మస్రు గతంలో నాటు సారా తయారీ చేస్తూ పట్టుబడడంతో నారాయణపురం తహసీల్దార్ ముందు బైండోవర్ చేయడం జరిగింది. అయితే బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించడంతో మంగళవారం రామన్నపేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆర్ బాలోజీ నాయక్ ఆమెకు 50 వేల రూపాయల జరిమానా విధించి వసూలు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా బాలాజీ నాయక్ మాట్లాడుతూ... బైండోవర్ నిబంధనలు పదేపదే ఉల్లంఘించిన వారు చట్టపరమైన చర్యలు ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు. అదేవిధంగా నాటుసారా తయారీదారులపై వరుస దాడులు నిర్వహించి పట్టుబడితే కఠిన శిక్ష అమల అయ్యేలా వ్యవహరిస్తామని దయచేసి ఎవరు నాటు సారా వైపు మొగ్గు చూపు వద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.