- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పసునూరు ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

దిశ, నాగారం: నాగారం మండల పరిధిలోని పసునూరు ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ బల్గూరి చంద్రబాబు శనివారం ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ,బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులకు 40 అడ్మిషన్ల చొప్పున మొత్తం 160 సీట్లు ఉన్నాయని తెలిపారు. ఆన్లైన్ లో మే 05 నుండి 20 మే 2025 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఎంపికైన విద్యార్థుల జాబితా 26 మే 2025న నోటీసు బోర్డులో ప్రదర్శించబడుతుందని, సర్టిఫికెట్ల ధృవీకరణ ప్రవేశ ప్రక్రియ మే 27 నుంచి 31 మే 2025 వరకు పూర్తవుతుందని అన్నారు. సీట్ల కేటాయింపు ఎస్ ఎస్ సి పబ్లిక్ పరీక్షల్లో మెరిట్ రాష్ట్ర ప్రభుత్వ రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఉంటుందని, ఎంపికైన విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్య, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, ఎమ్ సెట్/నీట్ కోచింగ్, కెరీర్ కౌన్సెలింగ్, బాలికలకు హాస్టల్ సౌకర్యం, యానిమేషన్ ఐటీ, బ్యూటీ, వెల్నెస్లో వృత్తిపరమైన కోర్సులు విద్యార్థులు సద్వినియోగపరుచుకోవాలని అన్నారు.