ఉత్తీర్ణతే కాదు ఉత్తమ ర్యాంకులూ మా టార్గెట్..

by Disha Web Desk 11 |
ఉత్తీర్ణతే కాదు ఉత్తమ ర్యాంకులూ మా టార్గెట్..
X

దిశ, తుంగతుర్తి: ఉత్తీర్ణతే ప్రధానం కాకుండా విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించే దిశగా తాము ముందుకు సాగుతున్నామని తెలంగాణ సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ రీజినల్ కో ఆర్డినేటర్ అరుణ కుమారి పేర్కొన్నారు. గురువారం తుంగతుర్తి నియోజకవర్గంలోని బాలికల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశం కావడంతోపాటు కళాశాల, పాఠశాల పరిసరాలు, భోజనం నాణ్యత తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆమె 'దిశ'తో మాట్లాడారు. తమ పరిధిలో ఉన్న పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కళాశాలలో విద్యా ప్రమాణాలు ఉన్నతంగా సాగుతున్నాయని వివరించారు. ఈ నెల 12 వ తేదీ నుంచి ఇంటర్, వచ్చే నెల 5 నుంచి పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చదువులో వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణతో పాటు భోజనాలు, తదితర వాటి పట్ల ఆమె సంతృప్తిని వ్యక్తం చేశారు. సమీపిస్తున్న వివిధ పరీక్షల్లో ఉత్తమమైన ర్యాంకులు సాధించడానికి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్యామలత తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed