రైతులు తెచ్చిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలి : కలెక్టర్

by Kalyani |
రైతులు తెచ్చిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలి : కలెక్టర్
X

దిశ, భువనగిరి రూరల్: వడ్ల కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే అన్నారు. భువనగిరి మండలం వీరవెల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. రైతులు ఎండిన ధాన్యాన్ని తెచ్చి మద్దతు ధర పొందాలన్నారు. ధాన్యాన్ని బయటి వ్యక్తులకు అమ్మవద్దని, రైతు తెచ్చిన ప్రతి ధాన్యం గింజ తో సహా కొంటామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేసి, రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులను ఆదేశించారు.

హమాలీలను, కాంటాలను పెంచుకొని టార్పాలిన్లు, గన్నీ బ్యాగుల అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అధికారుల తప్పిదాలతో కృత్రిమ సమస్యలను సృష్టించొద్దని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ పి.బెన్ షాలోమ్, భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి అమరేందర్, జిల్లా మార్కెటింగ్ అధికారి సబిత, సివిల్ సప్లై డి.ఎం.గోపీకృష్ణ, జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సహకార శాఖ ఇన్చార్జి అధికారి పి.ప్రవీణ్ కుమార్, ఎమ్మార్వో అంజిరెడ్డి, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు, మార్కెట్ కమిటీల సెక్రటరీ, వ్యవసాయ మండల అధికారి పావని, తంగెళ్లపల్లి శ్రీనివాస చారి పాల్గొన్నారు.



Next Story

Most Viewed