- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆయన హ్యాట్రిక్ గెలుపులో మాదే కీలక పాత్ర.....

దిశ, సూర్యాపేట: జిల్లా కేంద్రంలో అభివృద్ధి మాటున జరిగిన అవినీతిని ప్రశ్నించినందుకే మమ్మల్ని పార్టీ నుంచి బహిష్కరించారని 31వ వార్డు కౌన్సిలర్ కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించిన బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొండపల్లి దిలీప్ రెడ్డి, కౌన్సిలర్ నిఖిలలకు మద్దతుగా 15 మంది బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లు మూకుమ్మడిగా ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి విలువ లేదని, జనం మనసులో ఓ వ్యక్తి మంచిగా ఎదిగితే జగదీష్ రెడ్డికి నచ్చదని, అందుకే వారిని ఎలాగైనా అనగద్రోక్కాలనే తలంపుతో కుట్రలు చేయడం ఆయన నైజం అని ఆరోపించారు.
గత పదేళ్ల నుంచి పని చేసిన మాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా అని ప్రశ్నించారు. వార్డుల్లో జరిగిన అభివృద్ధి పనుల్లో శిలాఫలకాలపై కౌన్సిలర్ల పేరు పెట్టేందుకు కూడా అంగీకరించ లేదని ఆరోపించారు. అందుకే బీఆర్ఎస్ అహంకారానికి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఇక్కడ కూడా మున్ముందు అలాంటి పరిస్థితే ఎదురు కానున్నట్లు జోష్యం చెప్పారు. కానీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మూడోసారి గెలుపులో మేమంతా కీలకపాత్ర పోషించామని చెప్పారు. మున్సిపాలిటీలో మినహా ఆయనకు ఇతర మండలాల్లో ఓటింగ్ శాతం తగ్గిందన్నారు. మేం ఎప్పటికీ మా వార్డుల్లోనే ఉంటామని, ప్రజల మనుషులుగా చలామణి అయినందునే ప్రజా సమస్యల పైన అవిశ్వాసానికి వెళ్లినట్టు తేల్చి చెప్పారు. బీఎస్పీలో చేరిన కృపాకర్ను దగ్గరకు తీసుకున్న జగదీశ్ రెడ్డి మమ్మల్ని దూరం పెట్టి పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం విచారకరమన్నారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణకు తమను బహిష్కరించేందుకు సంతకం చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు.
ఎప్పటికైనా మేమంతా కలిసి కట్టుగా ఉంటామని భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు బచ్చలకూరి శ్రీనివాస్, జహీర్, ఎలిమినేటి అభినయ్, అనపర్తి రాజేష్, అనంతుల యాదగిరి, రాపర్తి శ్రీనివాస్, మామిడి గౌరయ్య, జ్యోతి కరుణాకర్, నాయకులు గండూరి రమేష్, రవి నాయక్, లింగా నాయక్, సిరివెళ్ల శబరి, కుంభం రాజేందర్, మకట్ లాల్ తదితరులు ఉన్నారు.