- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలి :మంత్రి

దిశ ,హుజూర్ నగర్ : గతంలో 10 ఏళ్లు పరిపాలన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి చేయలేదని మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా పాలకువీడు మండలంలోని జాన్ పహాడ్ దర్గా ఉత్సవాలలో పాల్గొని దర్గాను దర్శించుకుని అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి 400 కోట్లతో పాలకవీడు మండలాన్నికి కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. సంవత్సర కాలంలోనే దర్గా అభివృద్ధికి 1.30 కోటి లక్షలు మంజూరు చేసి పనులను పూర్తి చేశామని గుర్తు చేశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. గత 10 సంవత్సరాలు పరిపాలించి రేషన్ కార్డులు, ఇల్లు ఇవ్వని ప్రభుత్వం..ప్రస్తుతం తమ సీఎం తమ క్యాబినెట్ మంత్రులు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని, ఆ చిల్లర రాజకీయాలు మానుకోవాలని అన్నారు.
గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగిందని మళ్లీ ఇప్పుడు ఈ ప్రజా పాలన ప్రభుత్వంలోనే అభివృద్ధి కొనసాగుతుందని అన్నారు. 22,500 కోట్లతో 4.5 లక్షల ఇండ్ల నిర్మాణం కోసం ఖర్చు చేయబోతున్నామన్నారు. గత ప్రభుత్వం రైతుబంధు క్రింద 10 వేలు ఇస్తే రైతు భరోసా కింద వ్యవసాయానికి అనుకూలమైన భూమికి 12వేలు వేస్తామన్నారు. భూమి లేని రైతు కూలీలకు ఒక్కో కుటుంబానికి 12 వేలు ఇవ్వబోతున్నామని అన్నారు.రైతులు పండించిన సన్న ధాన్యానికి బోనస్ కూడా అందించామన్నారు. పాలకవీడు మండలంలో కృష్ణా నదిపై 173 కోట్లతో ఏర్పాటు చేసే జహావర్ జాన్ పహాడ్ లిఫ్టుకు మరో 100 కోట్ల పెంచి.. లిఫ్టు తో పాటు పైప్ లైన్ సామర్ధ్యాన్ని పెంచి 10వేల ఎకరాలకు సాగునీరు అందియబోతున్నామన్నారు. అలాగే బెట్టి తండా లిఫ్ట్ కు 33 కోట్లతో నిర్మాణం చేపడుతున్నామని, పైప్లైన్ కోసం భూ సేకరణ కూడా చేపడుతున్నామని, ఈ పనులు త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెల్లంకొండ విజయలక్ష్మి నరసింహారావు. మాజీ ఎంపీపీ గోపాల్ ,మాజీ జెడ్పిటిసి మాలోతు బుజ్జి మోతిలాల్ ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎన్ వి సుబ్బారావు, సప్పిడి, నాగిరెడ్డి ,జితేందర్ రెడ్డి ,వెంకటి నిమా నాయక్ ,సైదా మస్తాన్ పాల్గొన్నారు.