- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆన్లైన్లో వివరాలను సక్రమంగా యాప్లో ఎంటర్ చేయాలి

దిశ, నేరేడుచర్ల / గరిడేపల్లి: మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు రూ. 500 కే గ్యాస్ సిలిండర్ అందించేందుకు సంబంధించిన వివరాలను ఆన్లైన్ యాప్లో ఎంటర్ చేసేటప్పుడు సక్రమంగా ఎంటర్ చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధికారులకు సూచించారు. గురువారం నేరేడుచర్ల మండలంలోని చిల్లెపల్లి గ్రామంలో గరిడేపల్లి మండల కేంద్రంలో సర్వే చేస్తున్న అధికారుల పని తీరును ఆయన ఆకస్మితంగా వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన మహలక్ష్మీ పథకంలో భాగంగా రూ. 500 కే సిలిండర్ అందిస్తామని ప్రకటించింది. అందులో భాగంగా గతంలోనే ప్రభుత్వం గ్రామాలలో ప్రజా పాలన పేరుతో గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించామని ఆన్లైన్ చేశారు.
అందులో కొంత మంది దరఖాస్తులో వివరాలు పూర్తిగా రాయకపోవడంతో వాటిని సవరించేందుకు గ్రామాల్లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఇంటికి అధికారులు వస్తున్నారని వారికి సహకరించి మీ వివరాలను అందించాలని ఆయన ప్రజలను కోరారు. అన్ని గ్రామాల్లో శానిటైజేషన్ జరుగుతుందా లేదా అని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గరిడేపల్లి ఎంపీపీ సుజాత నేరేడుచర్ల గరిడేపల్లి తహసీల్దార్ సైదులు సురగి సైదులు బండ కవిత నేరేడుచర్ల గరిడేపల్లి ఎంపీడీఓ శంకరయ్య, వనజ గరిడేపల్లి ఏపీవో సురేష్ చిల్లెపల్లి ప్రత్యేక అధికారి రాజేశ్వరి, గరిడేపల్లి పంచాయతీ కార్యదర్శులు రమేష్, సురేష్ ఫీల్డ్ అసిస్టెంట్ మాతంగి సురేష్, మేకపోతుల సరిత, ఏఎన్ఎం మమత తదితరులు ఉన్నారు.