- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చౌటుప్పల్ లో కొనసాగుతున్న వాహనాల రద్దీ

దిశ,చౌటుప్పల్: సంక్రాంతి సెలవులు ముగిసి సోమవారంతో ప్రభుత్వ కార్యాలయాలు,స్కూలు పునః ప్రారంభం కావడంతో పండగకు సొంత ఊర్లకు వెళ్లినవారు తిరిగి హైదరాబాద్ బాట పెట్టారు. తెలంగాణలో పాఠశాలలకు శుక్రవారం వరకే సెలవులు ఇచ్చిన శనివారం ఒక్క రోజు పాఠశాలలు పని దినం ఉంది. దీంతో ఆదివారం సాయంత్రం బయలుదేరి సోమవారం నుండి తమ పనులు పున ప్రారంభించుకునేందుకు సొంత ఊర్లోకి వెళ్లినవారు తిరిగి బయలుదేరినట్లు తెలుస్తుంది. దీంతో ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. చౌటుప్పల్ పట్టణంలో రోడ్డు విస్తరణ, డ్రైనేజీ పనులు జరుగుతుండడంతో.. జాతీయ రహదారిపై వాహనాలు ముందుకు కదిలేందుకు కొంత సమయం పడుతుంది. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ ఏర్పడడంతో పోలీసులు ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు రంగంలోకి దిగారు.