- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
by Naresh |

X
దిశ, తుంగతుర్తి: మండలంలోని వెలుగు పల్లి గ్రామ శివారు వద్ద 365 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఎస్సై ఏడుకొండలు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. నూతనకల్ మండలం చిన్ననేమిల గ్రామానికి అనంతుల నాగరాజు తన స్నేహితుడైన మహేష్తో కలిసి ద్విచక్ర వాహనంపై సొంత గ్రామం నుండి హైదరాబాద్కు వెళుతుండగా వెలుగుపల్లి గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న లారీ అజాగ్రత్తగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. నాగరాజు, మహేష్లను చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నాగరాజు (28) మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
Next Story