- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అయ్యో..పెళ్లింట ఇలా జరిగిందేంటి..?

దిశ, కోదాడ :పెళ్లింటఇలా జరిగిందేంటి..? దొంగతనం జరిగిన సంఘటన కోదాడ పట్టణంలోని శ్రీనివాసనగర్ లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాస్ నగర్ కట్ట కొమ్ముగూడెం రోడ్డులో ఉన్న దశరథ అపార్ట్మెంట్ లో జనార్దన్ రెడ్డి తన కుమార్తె వివాహం జరిపించాడు. వ్రతం అనంతరం నిద్ర మలుపులకి అందరు ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి సీసీ కెమెరాల వైర్లు తొలగించారు. అనంతరం బీరువా తలుపులు పగులగొట్టి.. రెండు తులాల బంగార వస్తువులను, 0 పట్టు చీరలను, సుమారు 5000 రూపాయల నగదును చోరి చేసినట్లు భాదితులు తెలిపారు. గతంలో కూడా ఇదే అపార్ట్మెంట్లో దొంగతనం జరిగిందని స్థానికులు తెలుపుతున్నారు. విషయం తెలుసుకున్న టౌన్ ఎస్ఐ రంజిత్ రెడ్డి, క్లూస్ టీం సిబ్బంది పరిశీలించారు. కాగా దొంగల బెడద తో అపార్ట్మెంట్ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై రంజిత్ రెడ్డి తెలిపారు.