- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అయ్యో దేవుడా.. ఎంతపని చేశావయ్యా.. కన్నీళ్లు తెప్పిస్తున్నకుటుంబ కథ

దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం): పురిటితోనే అలముకున్న అంధత్వం ఒకరిది..! పక్షవాతానికి గురైన కుటుంబ పెద్ద..!! ఆలనా పాలన చూడాల్సిన మాతృమూర్తి క్యాన్సర్ తో మృత్యువాత...!!! చివరికి చిద్రమైన యావత్ కుటుంబం. ఏదైతేనేమి ఆవరించిన కటిక దరిద్రంతో మృత్యువాత పడ్డ తల్లి దశదినకర్మ చేయలేని పరిస్థితులు..ఎంతటి కఠినాత్ములనైనా గుండెలను కరిగిస్తూ కన్నీళ్లు తెప్పించిన మాతృ దేవోభవ సినిమాను మించిన నిజ జీవిత సంఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండలం మాచిరెడ్డిపల్లి గ్రామానికి చెందింది.
వివరాల్లోకి వెళితే... నాతి రమేష్ గౌడ్, రాణి దంపతుల కుటుంబం మొదటి నుంచి దారిద్య్ర రేఖకు దిగువదే. అయినా దానితో కుంగిపోకుండా కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగాలని ప్రయత్నిస్తే వెనకడిగే ముందు నిలిచింది. వీరికి సునీత, నవ్య అనే ఇద్దరు కూతుళ్లు జన్మించినప్పటికీ సంతోషం లేదు. ఎందుకంటే వీరిద్దరూ పురిటి గుడ్డి వాళ్ళు. కుమారుడు నరేష్ ఉన్నప్పటికీ నిష్ప్రయోజకుడే. అయినప్పటికీ జీవన సమరంలో ముందుకు సాగుతుంటే ఇంటి యజమాని రమేష్ లారీలకు ఇసుక ఎత్తే కూలిగా కొనసాగుతూ..నరాలు దెబ్బతిని పక్షవాతానికి గురై లేవ లేని దీనావస్థితిలో ఉండిపోయారు. ఇక కష్టమో నష్టమో..? అనుకుంటూ బాధలతో కుటుంబాన్ని ఈడ్చుకొస్తున్న సమయంలో రాణి కి క్యాన్సర్ మహమ్మారి తోడైంది. కడుపులో ఏర్పడ్డ క్యాన్సర్ గడ్డ చికిత్సకు పేదరికం అడ్డొచ్చింది. దిగాలుతో ఉన్న ఆమె అకస్మాత్తుగా గుండెపోటుకు గురై ఎనిమిది రోజుల క్రితం మృత్యువాత పడ్డారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తల్లి అంత్యక్రియలు చేయడానికి చేతిలో చిల్లిగవ్వ లేక ఆపన్న హస్తం కోసం ఆ పిల్లలు ఎదురుచూస్తున్నారు. నిరుపేద కుటుంబానికి సహాయం చేసి అంధురాల్లను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. దాతలు ఫోన్ పే, గూగుల్ పే 6309882351,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్ 41122189684 ద్వారా అంత్యక్రియలకు చేయూతనందించాలని కోరుతున్నారు.