బాల కార్మికులను పట్టించుకునే నాధుడే లేడా..

by Sumithra |
బాల కార్మికులను పట్టించుకునే నాధుడే లేడా..
X

దిశ, చింతపల్లి : చింతపల్లి మండలంలోని మాల్ పట్టణంలో మనసు చలించే ఘటన చోటుచేసుకుంది. బడిలో గడపవలసిన జీవితం బస్టాండ్ లో వాటర్ బాటిల్స్, బిస్కెట్ అమ్ముకునే విధంగా దిగజారి పోయిన ఒక విద్యార్థి దర్శనమిచ్చారు. ప్రభుత్వం ఎన్నో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు చేస్తూ బడి ఈడు పిల్లల్ని బడికి పంపించే విధంగా కార్యక్రమాలు చేస్తున్నా, ఇలా రోడ్డు పై జీవితాలు గడిపేటట్టు కనబడుతున్నా కూడా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి మార్పు లేకపోలేదు.

కనీసం ఆ బాల కార్మికుడిని పనిలో పెట్టుకున్న వారిపైన అయిన చర్యలు తీసుకోకపోవడం ప్రశ్నార్థకం. ఈ విషయం పై అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నిషితని వివరణ అడగగా మేము ఏం చేయాలని సగటు విలేఖరికి జవాబు ఇచ్చింది. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు వెంటనే చొరవ తీసుకొని బాల్యంలో మగ్గిపోతున్న జీవితాలను రక్షించి వారికి మంచి బంగారు భవిష్యత్తును ఇచ్చే విధంగా అధికారులు రాజకీయ నాయకులు ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. వివరణ అడగ్గా నిర్లక్ష్యం వహించిన అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు అనుకుంటున్నారు.



Next Story

Most Viewed