- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రజా ప్రభుత్వంలో పేద వారికి ఎలాంటి ఆపద రానివ్వం : దేవరకొండ ఎమ్మెల్యే

దిశ,చింతపల్లి : చింతపల్లి మండల పరిధిలోని ఆదివారం నెల్వాల పల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు,రేషన్ కార్డు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పథకాలకు అర్హులైన లబ్దిదారులకు మంజూరు పత్రాలనుఎమ్మెల్యే బాలు నాయక్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం అని అన్నారు.ప్రతి ఒక్కరి సంక్షేమం అభివృద్ధి మా ధ్యేయం..భూమిలేని నిరుపేద కూలీలకు ఉపాధి హామీ పథకంలో 20 రోజుల పాటు పని చేసిన వారందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తున్నాం.ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిజమైన లబ్దిదారులకే అందాలని ఇంకా ఎవరైనా మిగిలిపోయిన పేర్లు జాబితాలో లేకున్నా నమోదు చేసుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవ రెడ్డి, ఆర్డీవో రమణా రెడ్డి,నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్,మాజి ఎంపీపీ భవాని పవన్ కుమార్,మండల పార్టీ అధ్యక్షుడు నాగభూషణం,మాజి సర్పంచ్ గుండ్రటి శ్రీనివాస్,పార్టీ నాయకులు గోవర్ధన్,శ్రీనివాస్ యాదవ్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.