- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నందికొండ మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం..!
దిశ, నాగార్జునసాగర్: నందికొండ మున్సిపాలిటీలో అసమ్మతి సెగలు చెలరేగాయి. ముందు నుంచే నందికొండలో అసమ్మతులు, వర్గపోరు ఉంది.అధికార పార్టీకి చెందిన చైర్ పర్సన్ అనూష కుటుంబ సభ్యులు అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు కౌన్సిలర్లు ఏమి చెప్పినా పట్టించుకోవడంలేదని, వారి వార్డుల్లో సమస్యలు తీర్చుకునేందుకు కనీస నిధులు కేటాయించడం లేదని మండిపడుతున్నారు. దీంతో నందికొండ అభివృద్ధి కుంటు పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వారిపై విసుగు చెందిన కౌన్సిలర్లు బుధవారం అధికార పార్టీకి చెందిన చైర్ పర్సన్ అనూషపై సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లతోపాటు ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కూడా అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ జిల్లా అదనపు కలెక్టర్ను కలిసి నోటీసు ఇచ్చారు. మొత్తం 12 మంది కౌన్సిలర్లలో చైర్ పర్సన్, వైస్ చైర్మన్ మినహా మిగతా వారంతా అవిశ్వాస తీర్మానానికి ప్రతిపాదించారు. వీరికి ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు మద్దతు ఇచ్చారు.