- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
డీసీసీబీ నల్గొండ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం

దిశ,నల్గొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పై అవిశ్వాస ప్రక్రియ లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నెగ్గారు. డైరెక్టర్లు 19 గాను 15 మంది డైరెక్టర్లు పాల్గొని అవిశ్వాసం ప్రక్రియ కు పూర్తి మద్దతు తెలుపుతూ గొంగిడి మహేందర్ రెడ్డిని ఓడించడం జరిగింది. ప్రస్తుతం వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న దయాకర్ రెడ్డి ఇంచార్జ్ గా వ్యవహరిస్తారు. అలాగే చైర్మన్ ఎన్నిక జులై 1వ తేదీన జరుగుతుంది.
గొంగిడి మహేందర్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం చైర్మన్ రేసులో ఉన్న కుంభం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఆయన ఒంటెద్దు పోకడ పోవడం వల్లనే ఆయన మీద వ్యతిరేకత ఉంది. అనేక ఇబ్బందులు గురి చేశారు. అలాగే అవినీతి అక్రమాలకు పాల్పడటం జరిగింది అన్నారు. ఆయనకు నచ్చినట్లు వ్యవహరించారు అని తెలిపారు. అందరి సలహాలు సూచనలు తో బ్యాంక్ ని ముందుకు తీసుకెళ్తామని అన్నారు. గొంగిడి మహేందర్ రెడ్డి అనేక అక్రమాలు చేసినట్లు తెలిపారు. మాకు ఆయన సహకరించకున్నా మేము అందరికీ సహకరిస్తాం అన్నారు.
ప్రస్తుతం ఉన్న ఇంచార్జి చైర్మన్,వైస్ చైర్మన్
ఏసీరెడ్డి దయాకర్ మాట్లాడుతూ… గొంగిడి మహేందర్ రెడ్డి మా నిర్ణయాలను,డైరెక్టర్ల సలహాలను ఎప్పుడు కూడా తీసుకోలేదు అన్నారు. అందుకే అందరి నిర్ణయం మేరకు మేము అవిశ్వాస తీర్మానాన్ని నిర్ణయం చేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు 15 మంది పాల్గొన్నారు.