- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బృందావన్ ల్యాబ్స్ పై చర్యలు శూన్యం!

దిశ, చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోగల బృందావన్ ల్యాబ్స్ పరిశ్రమ యాజమాన్యం నిబంధనలకు పాతర వేస్తూ పరిసర ప్రాంతాలను కాలుష్యం చేస్తున్నారంటూ పలువురు కాలుష్య బాధితులు ఎన్జీటీను ఆశ్రయించారు. ఉత్పత్తుల నుండి వెలువడే వ్యర్థాలను పరిశ్రమ పరిధిలో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ద్వారా శుద్ధి చేయవలసి ఉంటుంది లేదా కాలుష్య నియంత్రణ మండలి అధికారుల అనుమతితో ఈటీపీకి పంపించాలి. కానీ పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థాలను నిబంధనల ప్రకారం నిర్వహణ చేపట్టవలసి ఉండగా అడ్డదారిలో ట్యాంకర్ల ద్వారా తరలిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో పారబోస్తున్నారు. పరిశ్రమ పరిధిలో గల బోర్లలోకి వదిలేస్తున్నారని తెలిసింది. లక్షలాది రూపాయలు ఖర్చు చేయకుండా అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
పీసీబీ చీఫ్ ఇంజనీర్ అండదండలతోనే?
బృందావన్ లేబరేటరీ పరిశ్రమ యాజమాన్యం నిబంధనలు పాటించకుండా వ్యవహరించడంతో పరిసర ప్రాంతాలు కాలుష్య కాసారాలుగా మారుతుండడంతో భూగర్భ జలాలు పరిషితమై పంటలు పండక నష్టపోయిన రైతులు కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదులు చేశారు. నల్లగొండ ప్రాంతీయ కార్యాలయ అధికారులు చర్యలు చేపట్టడానికి సిద్ధమవుతున్న సమయంలో ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చీఫ్ ఇంజనీర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారి బృందావన్ లాబ్స్ పై ఎలాంటి చర్యలు చేపట్టకుండా అడ్డుపడుతూ బృందావన్ యాజమాన్యానికి అండగా ఉంటున్నారని ఆరోపణలు జోరుగా వస్తున్నాయి. అందుకే బృందావన్ ల్యాబ్స్ ఫిర్యాదులపై టాస్క్ ఫోర్స్ మీటింగ్ ల పేరుతో కంటితుడుపు చర్యలు చేపడుతూ డైరెక్షన్స్ జారీ చేస్తూ అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నారని,పరిశ్రమ ఫిర్యాదులపై చర్యలు లేకపోవడంతో న్యాయస్థానాలను ఆశ్రయించవలసి వస్తుందని కాలుష్య బాధితులు వాపోతున్నారు.
బృందావన్ ల్యాబ్స్ పై న్యాయస్థానాలలో కేసులు..
కాలుష్య నియంత్రణ మండలి అధికారులు బృందావన్ ల్యాబ్ పరిశ్రమ కాలుష్యం పై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోకపోవడం తో తప్పనిసరి పరిస్థితులలో మరో దారి లేక జాతీయ హరిత ట్రిబ్యునల్ లో కేసులు వేయడంతో పర్యావరణ నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం చెల్లించాల్సిన నష్టపరిహారం పై కాలుష్య నియంత్రణ మండలి రాష్ట్ర కార్యాలయ అధికారుల సూచనతో హైకోర్టును ఆశ్రయించడం ద్వారా నష్టపరిహారం చెల్లింపులలో అడ్డంకులు కలిగాయని అందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బృందావన్ ల్యాబ్స్ పరిశ్రమ యజమాన్యానికి పీసీబీ అధికారులు అండదండలు అందిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజా ప్రయోజనాలను దెబ్బతీస్తూ అధికారులు పరిశ్రమ యాజమాన్యాలతో కుమ్మక్కు అయ్యారని దీంతో తమకు న్యాయం జరగడం లేదంటూ కాలుష్య బాధితులు లబోదిబోమంటున్నారు.