ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

by Naresh |
ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతు కే. జెండగే తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఈనెల 28 నుంచి వచ్చే మార్చి 16 వ తేదీ వరకు నిర్వహించబడే ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు, 30 పరీక్షా కేంద్రాల ద్వారా మొదటి, రెండవ సంవత్సరం కలిపి మొత్తం 12,559 మంది విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు, ఉదయం 9 తర్వాత విద్యార్ధులను పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతించబడరని, పరీక్ష వ్రాసే విద్యార్థినీ విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు. పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్స్, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, 30 పరీక్షా కేంద్రాలకు గాను 30 సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పకడ్బందీ పరీక్షల నిర్వహణ గాను సంబంధిత శాఖల అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, అందరి సమన్వయ సహకారంతో ఇంటర్మీడియట్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు.



Next Story

Most Viewed