మహిళ కళాశాల సిబ్బంది నిర్లక్ష్యం.. ఆరుబయట విద్యార్థునుల పడిగాపులు

by Aamani |
మహిళ కళాశాల సిబ్బంది నిర్లక్ష్యం.. ఆరుబయట విద్యార్థునుల పడిగాపులు
X

దిశ,నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ మహిళ కళాశాల సమయం 9 అవుతున్న కానీ గేటు తాళం తీయకుండా అధికారులు, ప్రిన్సిపాల్ మొద్దు నిద్రలో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. సుదూర ప్రాంతాల నుంచి కళాశాల కి వచ్చే వారికి గేటుకు తాళం వేసి ఉండటంతో గంటల కొద్దీ రోడ్డు మీద విద్యార్థునుల పడిగాపులు కాయాల్సి వస్తోంది. తాళం మరి తీసేదెప్పుడో అని విద్యార్థునుల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు ఇదే తంతు గా సమయ పాలన పాటించకుండా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది.నల్లగొండ నడిబొడ్డున ఉన్న కళాశాల అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం విస్మయం కు గురిచేస్తుంది.అధికారులు కూడా అదే దారిన వెళ్లిన విద్యార్థునుల పరిస్థితి పై నోరు మెదపకుండా ఉంటున్నట్లు సమాచారం.



Next Story

Most Viewed